by Suryaa Desk | Tue, Oct 08, 2024, 09:22 AM
గీసుగొండ మండలం లోని నందనాయక్ తండా గ్రామంలో సోమవారం యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్ సర్వేశం అధ్యక్షతన అవగాహన కార్యక్రమం జరిగింది.
ఫైనాన్స్ లిటరసీ కౌన్సిలర్ జిల్లా కోఆర్డినేటర్ టి. భాస్కర్ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాంఘిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకంలో 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తూ మరణిస్తే నామినికి రెండు లక్షల రూపాయలు వర్తిస్తాయన్నారు.