by Suryaa Desk | Mon, Sep 09, 2024, 10:54 AM
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా మదనాపురం రామన్ పాడు జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. కోయిల్ సాగర్, మన్నెవాగు, ఊక చెట్టు వాగులతో పాటు సరళాసాగర్, శంకర సముద్రం నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో సోమవారం అధికారులు రామన్ పాడు జలాశయం ఒక గేటు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ రనిల్ రెడ్డి తెలిపారు.