by Suryaa Desk | Wed, Sep 11, 2024, 10:01 AM
పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలపై, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.