|
|
by Suryaa Desk | Wed, May 28, 2025, 06:40 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రాబోయే చిత్రం 'భైరవం' లో భయంకరమైన మరియు కఠినమైన రూపాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ మరియు మనోజ్ మంచులతో నటుడు స్క్రీన్ స్పేస్ ని పంచుకున్నాడు. ఈ చిత్రం మే 30న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ప్రారంభించారు. ఈ సినిమా తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ యొక్క థీమ్ అఫ్ శీను వీడియోని రేపు సాయంత్రం 6:03 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News