|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:07 PM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సిద్ధంగా ఉండాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 22 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో అమలు చేసిన 'ఎస్ఐఆర్' ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. వీటికి సంబంధించిన సన్నాహకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈసీ సూచించింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.