|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 08:45 PM
థియేటర్లలో విడుదలైనప్పుడు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ప్రభాస్ చిత్రం ‘రాజా సాబ్’ (Raja Saab) ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణను అందుకుంటోంది.బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా, డిజిటల్ స్ట్రీమింగ్లో మాత్రం ఈ సినిమా కొత్త జీవం పొందింది. తాజాగా జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ చిత్రం, తెలుగుతో పాటు పలు భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది.ఓటీటీలో విడుదలైన తొలి వారంలోనే ఈ సినిమా 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ కారణంగానే ఈ రేంజ్లో స్పందన వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం. ఇదే ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయిన ‘సలార్’ కూడా భారీ వ్యూస్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులైన ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, ‘కల్కి 2’ చిత్రాలపై దృష్టి పెట్టారు. వీటిలో ‘ఫౌజీ’ చిత్రం దసరా సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
Latest News