మామాస్ రెస్టారెంట్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 11:58 AM
మున్సిపాలిటీ చెత్త ఆటోలో వృద్ధురాలి మృతదేహం తరలించడంపై విమర్శలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్కు చెందిన నర్సమ్మ (70) పట్టణంలోని కేసరి సముద్రం చెరువులో పడి మృతి చెందారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి పార్థివ వాహనం/ప్రైవేటు వాహనంలో తరలించకుండా పురపాలికకు చెందిన చెత్త ఆటోలో తీసుకెళ్లారు. ఈ ఘటనను ఓ కౌన్సిలర్ భర్త ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో స్థానికంగా వైరలైంది. అధికారుల తీరుపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.