|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 02:20 PM
నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలో శుక్రవారం 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' ఘనంగా ప్రారంభమైంది. కమిషనర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మీనాక్షి సెంటర్ వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి మానవహారం నిర్వహించారు. ఛైర్పర్సన్ శైలజ మాట్లాడుతూ, వార్డుల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, 99 రోజుల కార్యాచరణలో భాగంగా పట్టణ రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.