|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 03:13 PM
పటాన్చెరు :శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ నెల 25 నుండి 29 వరకు నిర్వహించనున్న శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని కలిసి, ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా గణపతి పూజ, కళ్యాణం, అన్నప్రసాద వితరణ, స్వామి వార్ల ఊరేగింపు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు.