|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 11:24 AM
హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా ఇంధన కొరత భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. పెట్రోల్ దొరకదేమోనన్న ఆందోళనతో ప్రజలు ముందస్తు జాగ్రత్తగా స్టాక్ ఉంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడ పెట్రోల్ బంకులు మూతపడగా, తెరిచి ఉన్న వాటిపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.