|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 11:19 AM
రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లిలోని మియాపూర్ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో మదీనగూడలోని కల్లం అంజిరెడ్డి విద్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధం, సైబర్ భద్రత, రోడ్డు నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లేష్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.