![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 04:19 PM
గోపీచంద్ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్కి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం గోపీచంద్ సరసన హీరోయిన్గా రితికా నాయక్ని (Rithika Nayak) ఎంచుకొన్నారు. బుధవారం ఇద్దరిపై ఫొటోషూట్ నిర్వహించారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో అలరించింది రితికి. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల మొదలైన వరుణ్ తేజ్ 15 చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానిక ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ సినిమా మొదలైందో లేదో.. మరో ఛాన్స్ కొట్టేసింది రితికా నాయక్.
గోపీచంద్ 33వ సినిమా ఇది. సంకల్ప్ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజువల్స్, మేకింగ్ విషయంలో సంకల్ప్ ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇతర విషయాలు తెలియాల్సి ఉంది.
Latest News