|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 10:19 AM
హైదరాబాద్, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల్లోని పీర్జాదిగూడ మోడల్ డంపింగ్ యార్డును MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయ ప్రమాణాలతో అమలు చేయాలని, తడి, పొడి వ్యర్థాల వేర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ పరిశుభ్రతను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల వర్గీకరణ, కంపోస్ట్ తయారీ విధానంపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ZCలు రాధిక గుప్తా, హేమంత్ కేశవ్ పాటిల్, DC శైలజ పాల్గొన్నారు.