![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 14, 2025, 10:28 AM
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నాడు. అందులో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి 'జాక్' కాగా మరొకటి 'తెలుసు కదా'. ఈ రెండు సినిమాల తర్వాత సిద్ధు 'కోహినూర్' అనే మరో చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇక 'టిల్లు క్యూబ్' మూవీ ఉండనే ఉంది. అయితే... సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం 'జాక్'కు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చుతున్నాడు. తాజాగా ఈ సినిమా రీ-రికార్డింగ్ కు ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ను ఎంపిక చేశారు. 'పుష్ప-2' సినిమాకు సైతం సామ్ సీఎస్ పనిచేసిన విషయం తెలిసిందే. అలానే సామ్ సీఎస్ సంగీతం అందించిన 'దిల్ రూబా' మార్చి 14న విడుదల కానుంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది.బ్లాక్ బస్టర్ హిట్స్తో దూసుకుపోతోన్న సంగీత దర్శకుడు శామ్ సీఎస్ 'జాక్' సినిమాలో సిద్దుని ఏ రేంజ్లో ఎలివేట్ చేస్తారా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.
Latest News