by Suryaa Desk | Sat, Feb 01, 2025, 08:05 PM
ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నగరంలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మార్చి నెలకు ముందే విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సమ్మర్ యాక్షన్ ప్లాన్తో వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. డిమాండ్కు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, ఎల్లారెడ్డిగూడ, శ్రీకృష్ణానగర్, కళ్యాణ్నగర్, బోరబండతో పాటు 24 సబ్స్టేషన్లతో సేవలు అందిస్తున్న అధికారులు లో-వోల్టేజీ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.బంజారాహిల్స్ డివిజన్లోని 1.80లక్షల మంది వినియోగదారులకు ఇప్పటికే 9971 విద్యుత్ నియంత్రిక (DTR)లతో విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులు.. ఈ ఏడాది 42 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. సరఫరాలో అంతరాయం, లో వోల్టేజీ సమస్యను పూర్తిగా అధిగమించేందుకు 160 కేవీ కెపాసిటిలో 37 విద్యుత్ నియంత్రికలు.. 100 కేవీ కెపాసిటిలో ఐదు ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సత్వరమే అక్కడికి చేరుకుని సేవలందించేందుకు సెంట్రల్ బ్రేక్డౌన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో డిమాండ్కు తగ్గట్లుగా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.