by Suryaa Desk | Mon, Feb 03, 2025, 04:16 PM
తెలంగాణ లో మరికొన్ని రోజుల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఉప ఎన్నికల కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే సుప్రీంకోర్టులోఫిబ్రవరి 10న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో రాజ్యాంగం నిర్దేశించిన చట్టం ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.దీంతో తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం పెద్ద చర్చకు దారితీస్తుంది. రాజ్యాంగం ప్రకారం, ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారడం లేదా శాసనసభ నుంచి అనర్హత పొందడం అనేది కీలక అంశంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఈనెల 10న సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టులో వచ్చే ఆదేశాలను బట్టి జవాబుదారీగా ఎటువంటి నిర్ణయం తీసుకోబడినా, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, తదుపరి ప్రయత్నాల కోసం చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ విచారణలో ముఖ్యంగా పార్టీ మారిన పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల నుంచి ఎదురు దాడి ఎదుర్కొంటున్నారు. ఈ అంశం తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను రేపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే పరిణామాలు, కొత్త వ్యూహాలను మరింత జాగ్రత్తగా అంచనా వేస్తుందని తెలుస్తోంది. గతంలో కూడా అనేక ఇతర రాజకీయ పార్టీల నేతలు.. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల్లో గెల్చిన తర్వాత పలు పార్టీలకు మారిన సంఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన ప్రతి సారీ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో ఈసారి సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో చూడాలి మరి.