by Suryaa Desk | Mon, Feb 03, 2025, 03:07 PM
హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ మృతిచెందారు. సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు వద్ద అదుపుతప్పిన బైకు హద్దు రాయిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన గన్మెన్ శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించారు. ఆయన స్వస్థలం శంకర్పల్లి మండలం బుల్కాపూర్. గత కొంతకాలంగా ఎమ్మెల్యే యాదయ్య వద్ద గతకొంత కాలంగా గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు.