by Suryaa Desk | Mon, Feb 03, 2025, 04:06 PM
తెలంగాణలోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు చేయించడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యలను తమ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని అన్నారు. ప్రస్తుతం జర్నలిస్టు ఇండ్ల సొసైటీ సమస్య సుప్రీం కోర్టు పరిధిలో ఉందని.. అయినప్పటికీ అతి త్వరలోనే వారి సమస్యకు పరిష్కారం చూపిస్తామని మంత్రి భరోసానిచ్చారు.