by Suryaa Desk | Mon, Feb 03, 2025, 04:14 PM
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా సోమవారం టీపీసీసీ ఆదేశాల మేరకు, మల్కాజిగిరి పరిధిలోని ఆనంద్ బాగ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై నినాదాలు తెలియజేస్తూ తెలంగాణకు సరైన విధంగా నిధులను విడుదల చేయాలన్నారు.