by Suryaa Desk | Mon, Feb 03, 2025, 04:12 PM
మాజీ మంత్రి కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ సవాల్ విసిరారు. కేటీఆర్, కేసీఆర్కు దమ్ముంటే శివారెడ్డిపల్లి రావాలని అన్నారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత మాఫీ అయ్యిందో చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ చేశారు. పరిగి నియోజకవర్గంలో రూ.1000 కోట్ల రుణమాఫీ అయ్యిందని అన్నారు. సోషల్మీడియాలో ఎంత బురదచల్లినా జనం నమ్మరని.. కేటీఆర్, హరీష్, కవిత లాటరీ బ్యాచ్ అని MLA రామ్మోహన్ ఎద్దేవా చేశారు.