![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:47 PM
బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పరుగులు పెడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. బులియన్ మార్కెట్లో పసిడి 90మార్క్కు చేరువవ్వగా..వెండి లక్షా 10వేల మార్క్ దాటి పరుగులు తీస్తోంది.. వాస్తవానికి పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు ధరలు పెరిగితే, మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. తాజాగా.. పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది.. మంగళవారం (18 మార్చి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.82,090, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.89,550 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,02,800లుగా ఉంది. బంగారంపై రూ.10 మేర, వెండి రూ.100 మేర ధర తగ్గింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.82,240, 24 క్యారెట్ల ధర రూ.89,700 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.82,090, 24 క్యారెట్ల ధర రూ.89,550 గా ఉంది.