గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 11:50 AM
మల్కాజిగిరి కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారంలో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలోని హనుమాన్ దేవాలయంపై ఒక గుర్తు తెలియని వ్యక్తి నమాజ్ చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. బీజేవైఎం నాయకులు, స్థానికులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. మేడిపల్లి పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యక్తి పేరు జుబేర్గా తెలుస్తోంది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.