గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 3 ఏళ్ల చిన్నారికి నాగబాబు ఆర్థిక సాయం
Mon, Feb 23, 2026, 11:22 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 12:54 PM
న్యాల్కల్ జెడ్పీహెచ్ఎస్లో మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు రాజ్కుమార్ గురువారం మాట్లాడుతూ ఈ సమావేశాలు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రిత బోధన, ఫలితాలు పెంచే పద్ధతులపై చర్చించారు. ఉపాధ్యాయులు ఇక్కడ నేర్చుకున్న నూతన పద్ధతులను తరగతి గదుల్లో అమలు చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సూచించారు. వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు వార్షిక విద్యా ప్రణాళిక, బోధనలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.