|
|
by Suryaa Desk | Thu, Feb 26, 2026, 01:54 PM
నాగార్జున సాగర్ నియోజకవర్గం, అనుముల మండలం పాలెం గ్రామంలో సర్పంచ్ జిల్లా హరిబాబు ఆధ్వర్యంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి, వారికి సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, ఇది తనకు దక్కిన అదృష్టమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ ఆఫీసర్, ఉపసర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, నాయకులు, యువత పాల్గొన్నారు.