మామాస్ రెస్టారెంట్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:49 PM
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు అనుమతి ఇవ్వగా.. తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ గోడం నరేష్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందుతుందన్నారు.