|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 12:55 PM
మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు. మంగళవారం చలో హైదరాబాద్కు వెళ్తున్న మున్సిపల్ కార్మికుల వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా పారిశుధ్య పనులు చేస్తూ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.