|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:28 PM
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం గ్రామంలో గ్రామ దేవతలైన దుర్గమ్మ, పోచమ్మల జాతర్లకు నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డిని గ్రామ సర్పంచ్ వారాల వీరేశం యాదవ్, ఉప సర్పంచ్ మీసాల కృష్ణ, గ్రామ పెద్దలు కలిసి సోమవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గ్రామ దేవతల జాతర్లు నిర్వహించడం వల్ల పశుసంపద, పంటలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాన్ని సంరక్షించడంలో గ్రామ దేవతల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు.