|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 04:06 PM
సమస్యను పరిష్కరించుకోవడంలో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్మున్సిపాలిటీలోని చక్రపురి కాలనీవాసులు ఆదర్శంగా నిలిచారని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. సమస్యలపై ఫిర్యాదు చేయడమే కాదు.. వాటి పరిష్కారానికి సంబంధిత పత్రాలను అందజేసి అధికారులకు సహకరించిన తీరు అభినందనీయమన్నారు. 20 ఏళ్ల సమస్యను హైడ్రా పరిష్కరించినందుకు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారిని అభినందించడానికి తాము వస్తే.. మాకు సత్కారం చేస్తారేంటి సార్ అంటూ చక్రపురి కాలనీవాసులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సమస్యలతో సతమతం అవ్వడం కాదు.. వాటి పరిష్కారానికి మీలా ప్రతి కాలనీ సంక్షేమ సంఘం ప్రయత్నించాలని హైడ్రా కమిషనర్ సూచంచారు. స్థానికంగా మీతో కలిసి సమస్యను పరిష్కరించడంలో హైడ్రా ఇన్స్పెక్టర్ బాలగోపాల్ గారు కూడా అభినందనీయుడే అంటూ కమిషనర్ కొనియాడారు. ఇదంతా హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది.