|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 06:50 PM
లోకల్ ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆశించిన సీట్లు రాకపోవడంతో కాంగ్రెస్ లో అసంతృప్తి ఉందని, బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చినా అంతా బాగానే ఉందని చెప్పడం అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ గట్టిగా పోరాడిందని, ప్రస్తుతం ఉన్న 17 మున్సిపాల్టీలతో పాటు హంగ్ స్థానాల్లోనూ ఎక్కువ గెలుచుకుంటామని కేటీఆర్ మీడియాతో తెలిపారు.