|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:18 PM
TG: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ మంచి జోరు మీద ఉంది. ఇక ఇదే ఊపులో ఎంపీటీసీ, ZPTC ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో మున్సిపల్ ఫలితాలను సమీక్షించడంతోపాటు అసెంబ్లీ సమావేశాలు, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణపై చర్చించనున్నారు. అలాగే పరిషత్ ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించనున్నారని సమాచారం. మరో రెండు వారాల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారని టాక్