|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 08:57 PM
హైదరాబాద్లో స్కూల్ విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఫిలింనగర్ పరిధిలోని వినాయక్ నగర్ బస్తీలో స్కూల్ విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి దారుణంగా కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు ప్రదర్శించుకున్నారు. బుధవారం ఈ ఘటన జరగగా.. స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై ఇలా గొడవలు పడటం ఏంటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.