మామాస్ రెస్టారెంట్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాద్రి పృథ్వీరాజ్
Wed, Feb 18, 2026, 09:57 PM
|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 12:12 PM
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆయన సతీమణి జ్యోతి గురువారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గద్వాల నియోజకవర్గ ప్రజలు, రైతాంగం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో సర్పంచ్ విజయ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.