|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:19 PM
యాప్ వాట్సాప్కు చెందిన వెబ్ సేవల్లో శుక్రవారం ఉదయం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలువురు యూజర్లు వాట్సాప్ వెబ్లోకి లాగిన్ అవ్వడంలో చాట్లను సింక్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెస్క్టాప్లు, ల్యాప్టాప్లలో వాట్సాప్ వాడే యూజర్లు ఈ సమస్య కారణంగా కొంతసేపు ఇబ్బంది పడ్డారు.ఔటేజ్లను ట్రాక్ చేసే వెబ్సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం నిన్న ఉదయం 9 గంటల సమయంలో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. ఉదయం 8:54 గంటలకే సుమారు 16 మంది యూజర్లు ఫిర్యాదు చేసినట్టు ఈ వెబ్సైట్ గుర్తించింది. ఆ తర్వాత అరగంటకు పైగా కూడా సమస్య కొనసాగింది, ఫిర్యాదుల సంఖ్య 28కి చేరింది. దీంతో సమస్య కొంతసేపు కొనసాగినట్లు స్పష్టమైంది.ఈ సాంకేతిక లోపంతో చాలామంది యూజర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్టులు పెట్టారు. ‘వాట్సాప్ అందరికీ డౌన్ అయిందా? నా ఐఫోన్, లింక్డ్ డివైజ్లలో లాగిన్ చేయడానికి ప్రయత్నించి గంట దాటింది’ అంటూ ఒక యూజర్ తన ఇబ్బందిని పంచుకున్నారు. ఇలాంటి పోస్టులతో ప్లాట్ఫామ్ నిండిపోయింది.అయితే, ఈ అంతరాయంపై వాట్సాప్ మాతృసంస్థ మెటా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా దీనిపై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. సమస్యకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొబైల్ యాప్లో మాత్రం సేవలు యథావిధిగా కొనసాగాయి.