![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 11:25 AM
విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణం 6వ డివిజన్లోని యజ్ఞ వరాహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల కుటుంబ సభ్యులతో పాటు శ్రీ యజ్ఞ వరాహస్వామి ఆలయ కులపతి శ్రీ భాష్యం వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్ రెడ్డి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.