![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 07:48 PM
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఈ నెల 7న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 8న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సిద్ధిపేట, జనగామ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూర్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో నారాయణపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది.