![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 27, 2024, 03:07 PM
దేశంలోని నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం-2023పై పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి నెల రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి. అడిషనల్ డిసిపి రాజు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి సిపి హాజరై మాట్లాడారు.