![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 03:22 PM
ఇంటి నల్ల పనులు చెల్లించకపోతే తక్షణమే నోటీసులు జారీ చేయాలని భిక్కనూరు మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, గ్రామాలలో పన్నుల బకాయిలు పేరుకపోతున్నాయని చెప్పారు. దీంతో గ్రామాలలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయడం లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. పన్నుల వసూలుపై జీపీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.