![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 01:16 PM
డా. బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ (సైన్స్, కంప్యూటర్ విభాగాలు) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్-6 ప్రయోగ తరగతులు ప్రారంభిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డా. జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. తరగతులు మంగళవారం ఉదయం 10: 00 నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు మ్యానువల్ పుస్తకాలు, ఫీజుల రసీదులు వెంట తీసుకురావాలని అన్నారు.