![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 02, 2024, 04:13 PM
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని రాజశేఖర్ కాలనిలో సుమారు 22 లక్షల రూపాయలతో డ్రైనేజ్, సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పోరేటర్ భూక్య సుమన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు, డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు, ఏవైనా సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.