![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:06 PM
వనపర్తి జిల్లా పెద్దమందరం మండలం మోజర్ల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఏర్పాటు చేయించిన బోరు మోటార్ ను మంగళవారం రాత్రి ఎమ్మెల్యే ప్రారంభించారు. దీంతో గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారమైందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు ప్రసాద్, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.