![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 11:22 AM
విద్యుత్ షాక్ తో లైన్మెన్ మృతి చెందిన సంఘటన ఆందోలు మండలం ఎర్రారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామంలో లైన్ మైన్ చంద్రశేఖర్ (30) విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మత్తులు చేస్తుండగా ఒకేసారి విద్యుత్ సరఫరా ఇచ్చారు. విద్యుత్ షాక్ తో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ ను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.