![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:34 PM
పాఠశాల విద్యార్థులకు రోడ్డు నిబంధనల గురించి, డయల్ 100 గురించి మంగళవారం పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. కామారెడ్డి పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అదే క్రమంలో గొల్లవాడలోని ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది. రోడ్డు నిబంధనల గురించి తెలియజేశారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలిపారు.