![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 01:25 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన ఓ మహిళ జూన్ 30వ తేదీ నుంచి ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయింది. కుమార్తె, కుమారుడిని పాఠశాల నుంచి తీసుకొని వెళ్ళిన మహిళ తిరిగి ఇంటికి రాలేదు. భర్త, మహిళ బంధువులు ఎక్కడ వెతికిన మహిళ ఆచూకీ కనిపించలేదు. బుధవారం మహిళ భర్త పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు.