![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 01:39 PM
స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా పటాన్ చెరులోని ఆయన విగ్రహానికి కార్పొరేటర్ కుమార్ యాదవ్ పూలమాలవేసి గురువారం నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ వివేకానందుని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. భారతదేశ చరిత్రను ప్రపంచమంతా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.