![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:33 PM
భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో నివాసముంటున్న పేదల ఇండ్లకు కరెంటు సౌకర్యంతో పాటు మంచినీటి వసతి కల్పించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి నరసింహులు కోరారు. బుధవారం కాలనీవాసుల ఆధ్వర్యంలో మండల అభివృద్ధి కార్యాలయానికి తరలివచ్చి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. గత కొన్ని సం. లుగా నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని చెప్పారు. కొందరు ఇల్లు నిర్మించుకున్నారని గుర్తు చేశారు.