![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 02:18 PM
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్లో వున్న వేతనాలు విడుదల చేయాలని నారాయణపేట జిల్లా సిఐటియు కార్యదర్శి బలరాం బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని, జీతాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. వేతనాలు అందక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికుల జీతాలు విడుదలకు చొరవ చూపాలని కోరారు.