![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 03, 2024, 04:27 PM
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని బుధవారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 6వేల రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయం అధికారి చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.