![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 01:24 PM
అమరచింతలో ప్రభుత్వ టీచర్ పై రౌడీషీటర్ దాడి చేశాడు. యంఈఓ భాస్కర్ సింగ్ వివరాల ప్రకారం.. స్థానిక స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హోం వర్క్ చేయలేదని సోమవారం టీచర్ కొట్టారు. విద్యార్థి తండ్రి పాఠశాలకు రాగా నచ్చజెప్పి పంపారు. బుధవారం విద్యార్థి తండ్రితో పాటు వచ్చిన రౌడీషీటర్ సదరు టీచర్ పై దాడీ చేసి బ్లేడ్ తో బెదిరించి వెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని కానీ కేసు వద్దన్నారని ఎస్ఐ సురేశ్ తెలిపారు.