![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 03:36 PM
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని గిద్ద దళితవాడకు వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఎట్టకేలకు తొలగించారు. విద్యుత్ స్తంభాన్ని తొలగించేందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విద్యుత్ అధికారులకు అందజేశారు. దీంతో విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించి స్తంభాన్ని తొలగించారు. అనంతరం ప్రజలకు ఇబ్బందులు లేకుండా మరో స్తంభాన్ని బిగించారు.