![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 04, 2024, 12:03 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సురారం పోలీస్ స్టేషన్ కట్ట మైసమ్మ చెరువులో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మహిళను రాజీవ్ గాంధీ నగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.